Webdunia - Bharat's app for daily news and videos

Install App

సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం... లుకౌట్ నోటీసు జారీ

ఠాగూర్
మంగళవారం, 12 నవంబరు 2024 (18:36 IST)
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకుగాను వైకాపా సోషల్ మీడియా విభాగం ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఈయన అజ్ఞాతంలో ఉన్నారు. ఈయన ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా పేరుగడించిన వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సుపుత్రుడే ఈ సజ్జల భార్గవ్ రెడ్డి. ఈయన వైకాపా సోషల్ మీడియా ఇన్‌చార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాతే వైకాపా నేతలు విపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై రాయలేని భాషలో ఉండే అసభ్యకర పోస్టులతో రెచ్చిపోయారు. ఈ కేసులో కీలకంగా ఉండే వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. దీంతో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 
 
వర్రా రవీంద్రా రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా, ఈ కంటెంట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని సజ్జల భార్గవ్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, మరో కీలక నేత అర్జున్ రెడ్డిలే ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు. దీంతో సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, మరో కీలక నేత కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వీరు దేశం దాటి వెళ్లకుండా లుకౌట్ నోటీసులను పోలీసులు జారీ చేశారు. కాగా, భార్గవ్ రెడ్డిపై ఇప్పటికే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైవున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments