లోకేష్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి: వైసీపీ

Webdunia
బుధవారం, 6 మే 2020 (20:49 IST)
లోకేష్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నాయకులు అన్నారు. మంగళగిరి పట్టణంలోని వైకాపా మాజీ కౌన్సిలర్ సంకే సునీత నివాసంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షులు మునగాల మలేశ్వరావు, గుంటూరు పార్లమెంటు అధికార ప్రతినిధి శ్యామ్ బాబు మాట్లాడారు.

మంగళగిరి పట్టణంలో 32వ వార్డు లో చోటుచేసుకున్న ఘటన నారా లోకేష్ స్క్రీన్ ప్లే లొనే జరిగిందని దాన్ని వైయస్సార్ సిపి నియోజకపార్టీ ఖండిస్తుందని అన్నారు. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారని. మంగళగిరి పట్టణంలో రెండు పాసిటీవ్ కేసులు నమోదై వారు పూర్తిగా కోలుకుని ఇంటికి చేరిన సంగతి తెలిసిందేనని అన్నారు.

ఈ తరుణంలో కుల రాజకీయాలకు తెర తీయటం సరికాదని విమర్శించారు. మంగళగిరి లో పోటీ చేసి గెలవలేదన్న కక్షతో ఇక్కడ వివాదాలు చేయాలని చూడడం సరికాదన్నారు.

గోరంతను కొండంత చేయడంలో తెదేపా ముందుంటుందని చెప్పారు. కక్ష సాధింపు రాజకీయాలు మానుకుని నిజానిజాలు తెలుసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments