Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్ సాయం చోరీకి గురైంది

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (08:07 IST)
ఓ బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు చేసిన ఆర్థిక సాయం చోరీకి గురైంది. దీంతో ఆ బాధితులు లబోదిబోమంటున్నారు.
 
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన అంధ దంపతులు పాపిరెడ్డి, రేవతికి ముగ్గురు కుమారులు. ఎనిమిదేళ్ల వయసున్న వీరి పెద్ద కుమారుడు గోపాలకృష్ణారెడ్డి ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. తల్లిదండ్రులను ఆటోలో కూర్చోబెట్టుకుని గ్రామాల్లో వివిధ తిరుగుతూ రకాల పప్పులు అమ్ముకొంటూ జీవనం సాగిస్తున్నారు.

ఎనిమిదేళ్ల బాలుడు ఆటో నడిపే వీడియో ప్రసార మాధ్యమాల్లో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్‌ స్పందించి పాపిరెడ్డి కుటుంబానికి తొలిసారిగా రూ.20 వేలు, రెండో విడత రూ.80 వేలను టీడీపీ నాయకుల ద్వారా అందజేశారు. రెండో విడత ఇచ్చిన నగదును పాపిరెడ్డి తన ఇంట్లో ట్రంక్‌ పెట్టిలో పెట్టారు.

మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. బుధవారం ఉదయం ట్రంక్‌ పెట్టిలో చూడగా, రూ.80 వేల నగదు మాయమైందని గుర్తించారు. ఇంటి పరిసరాల్లో తనిఖీ చేయగా ఓ సెల్‌ఫోను దొరికింది.

దీంతో పాపిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసి, దొరికిన సెల్‌ఫోనును పోలీసులకు అప్పగించారు. క్లూస్‌టీమ్‌ వేలిముద్రలు సేకరించింది. కాగా, మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments