Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వం మరిచి ఎస్సీ రైతులకి సంకెళ్లు వేసి జైళ్లో పెట్టారు: నారా లోకేష్

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (23:11 IST)
కృష్ణాయపాలెం ఎస్సీ రైతులకు జగన్ ప్రభుత్వం మానవత్వం మరిచి సంకెళ్లు వేసి జైళ్లోపెట్టిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. 
 
తమను జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందంటూ బెయిల్ పై  విడుదలైన రైతులు లోకేశ్ తో సమావేశమై  కన్నీటి పర్యంతమయ్యారు. 
 
వారిని పరామర్శించిన లోకేష్ అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసినవారే కంప్లైంట్ వెనక్కి తీసుకున్నా రైతులకు సంకెళ్లు వేయించటం జగన్ రెడ్డి శాడిజానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు.
 
 "దాడులు దౌర్జన్యాలెన్నో భరిస్తూ ఎంతకాలమైనా వెన్నుచూప‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్షణ ఉద్యమందే అంతిమ విజ‌యమని లోకేష్ స్పష్టం చేశారు.
 
రైతుల పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండ‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. అన్నం పెట్టే అన్నదాతలు భూతల్లిని రాజధాని కోసం చేసిన త్యాగాలను లోకేష్ కొనియాడారు. అమ‌రావ‌తిని చంపేసే కుట్రల్ని నిర‌సిస్తూ శాంతియుతంగా ఉద్యమిస్తున్నవాళ్లని గుర్తు చేశారు. 
 
తమ త్యాగాల పునాదుల‌పై ఏర్పడిన ప్రజారాజ‌ధానికి స‌మాధి క‌ట్టొద్దంటూ నిన‌దించిన కృష్ణాయ‌పాలెం రైతులు, మూడుముక్కలాట‌కి మ‌ద్దతుగా వ‌చ్చిన బిర్యానీ ఆర్టిస్టుల్ని అడ్డుకోవ‌డ‌మే నేరంగా ప‌రిగ‌ణించి, ఎస్సీల‌పైనే ఎస్సీ, ఎస్టీ కేసు జగన్ రెడ్డి పెట్టించారని లోకేష్ ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments