Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా, కరోనాను మించిన అపాయం చిత్తూరు జిల్లాకు వచ్చింది, ఏంటది?

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (20:36 IST)
మిడతలు జనానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మిడతలు రైతులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. నిన్నటికి నిన్న అనంతపురం జిల్లాలోకి మిడతలు వస్తే ఈ రోజు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించాయి. ఒకవైపు కరోనా దెబ్బతో జనం భయపడిపోతుంటే ఇప్పుడు లక్షలాది మిడతలు గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతానికి ఈ గుంపు చేరుకుంది.
 
ముఖ్యంగా కుప్పం సమీపంలోని తమిళనాడు రాష్ట్రం వేపనపల్లి వద్ద ఇవి స్థావరాలను ఏర్పాటు చేసేసుకున్నాయట. దీంతో రైతులు, ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే మిడతలు కొన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ పంటలను తీవ్రంగా నష్టపరిచాయి.
 
మిడతల నుంచి కాపాడుకునేందుకు రైతులు రకరకాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. రసాయనాలతో పిచికారీ చేస్తున్నా ఉపయోగం లేకుండా పోతోంది. లక్షలాది మిడతలను అడ్డుకోవడం ఎవరి వల్లా సాధ్యం కావడం లేదు. మొన్న కర్ణాటక, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో మిడతలు స్వైర విహారం చేయడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments