Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఆగస్టు 14 వరకు లాక్‌డౌన్, గోవిందుడి దర్శనానికి గ్రీన్ సిగ్నల్

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (17:53 IST)
ప్రపంచ ప్రసిద్ది గాంచిన ఏడుకొండల స్వామి నిలయం ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం దిగువ ఉన్న టెంపుల్ టౌన్ తిరుపతిలో ఆగస్టు 14 వరకు లాక్డౌన్ పొడిగించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో తిరుపతి లాక్ డౌన్ పొడిగించారు.
 
అయితే తిరుమల వెళ్లే ఏడుకొండల స్వామి భక్తులపై లాక్ డౌన్ ప్రభావం పడకుండా, వారికి ఏలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పంపిస్తున్నామని అధికారులు తెలిపారు. గోవిందుని దర్శనానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్టు14వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే లాక్‌డౌన్ సడలింపు ఉంటాయని అధికారులు తెలిపారు.
 
తిరుమల కొండకు వెళ్లే భక్తులు వారివారి వాహనాల్లో తిరుపతి బైపాస్ రోడ్డు మీదుగా తిరుమలకు ప్రయాణించడానికి ఏర్పాట్లు చేసారు. తిరుమల ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి ప్రజలు సైతం తిరుమల వెళ్లే భక్తులకు సహకరిస్తామని అధికారులకు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments