Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ : ఆ డబ్బులు ఎక్కడ దాచారో కోర్టుకు చెబుతారు : కేజ్రీవాల్ సతీమణి

వరుణ్
బుధవారం, 27 మార్చి 2024 (16:50 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ విచారణ జరుగుతుంది. ఈ సమయంలో ఆయన సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. లిక్కర్ స్కామ్‌లో నిజానిజాలను తన భర్త గురువారం కోర్టులో బయటపెట్టనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశాన్ని బుధవారం విడుదల చేశారు. 
 
"నా భర్తను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనకు ఆరోగ్యం సరిగా లేదు. చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. కస్టడీలోను ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచి నీటి సమస్యను నివారించాలని రెండు రోజుల క్రితం మంత్రి అతిశీకి లేఖ పంపారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యగా మారుస్తుంది. ఆయనపై కేసులు పెడుతుంది. ఢిల్లీని నాశనం చేయాలని కేంద్రం కోరుకుంటున్నారు. ఈ పరిణమాలతో ఆయన ఆందోళనకు గురవుతున్నారు" అన్నారు. 
 
"మద్యం కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటివరకు 250 సార్లకు పైగా సోదాలు జరిపింది. ఎందులోనూ వారికి ఏమీ దొరకలేదు. ఈ కేసుకు సంబంధించి మార్చి 28వ తేదీ కోర్టులో అన్ని నిజాలు బయటపెడతానని కేజ్రీవాల్ చెప్పారు. లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడుందో ఆయన న్యాయస్థానంలో చెబుతారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారు" అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments