పాత మేనిఫెస్టోలోని మద్యపాన నిషేధమే అమలుచేయలేదు, ఇంక కొత్తదా?: వైఎస్ షర్మిల

ఐవీఆర్
శనివారం, 27 ఏప్రియల్ 2024 (20:18 IST)
కొత్త మేనిఫెస్టో సంగతి అంట్లుంచండి. గత ఐదేళ్ల నాడు ఇదేవిధంగా జగనన్న మైకు బట్టుకుని రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం, అలా చేస్తేనే మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతాం అని అన్నారు. చేసారా అన్నా అంటూ వైఎస్ షర్మిల విమర్శలు సంధించారు.
 
సర్కారే మద్యం అమ్ముతుంది. వాళ్లు ఏది అమ్మితే అదే కొనాలట. నాసిరకం మందు, ఈ లిక్కర్ తాగి 25 శాతం మంది లివర్, కిడ్నీలు చెడిపోయి చనిపోతున్నారు. మద్యం అమ్మకాలు చేసేటపుడు సేల్స్ ట్యాక్స్ లేదు, ఒక పద్ధతి లేదూ పాడూలేదు. జనం ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు.
 
గత మేనిఫెస్టోలో డీఎస్సీ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, రాజధాని అన్నారు.. ఒక్కటైనా అయ్యిందా అన్నా. ప్రజలు నమ్మి ఐదేళ్లు అధికారంలో ఇస్తే..హోదా తెచ్చారా ? రాజధాని కట్టారా.. ? పోలవరం కట్టారా?.. రాష్ట్రానికి హోదా రావాలి అంటే జగన్ దిగాలి.. కాంగ్రెస్ అధికారంలో రావాలి. పోలవరం కట్టాలి అంటే కాంగ్రెస్ కావాలి.. జగన్ దిగాలి. రాజధాని నిర్మించాలి అంటే కాంగ్రెస్ రావాలి.. జగన్ అధికారం నుంచి దిగాలి. రాష్ట్రాన్ని తన మాయ మాటలతో నిలువునా మోసం చేసినా ఈ జగన్ మోహన్ రెడ్డి మనకి అవసరమా? అందుకే హస్తం గుర్తుకు ఓటు వేయండి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుందాం అంటూ చెప్పారు వైఎస్ షర్మిల. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

11 నెలల పాటు ఈఎంఐ కట్టలేదు.. వేలానికి రవి మోహన్ ఇల్లు.. నోటీసులు అంటించేశారు..

గుజరాత్ బ్రాండ్ కాన్‌ప్లెక్స్ సినిమాస్ ప్రారంభించిన స్పీకర్, సిద్దు జొన్నలగడ్డ

Pawan: డల్లాస్ లో ఓజీ 25 అడుగుల కటౌట్ - నైజాంలో పుష్ప 2: ది రూల్ ను క్రాస్ చేస్తుందా....

హారర్ కాన్సెప్ట్‌లో ప్రేమ కథ గా ఓ.. చెలియా టీజర్ ను ఆవిష్కరించిన శ్రీకాంత్

Chakri: సింగర్ జుబీన్ గార్గ్‌కు హీరోయిన్ భైరవి అర్ద్య డేకా ఘన నివాళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments