Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోనే నమాజ్ చేసి కరోనా కట్టడి చేద్దాం: మంత్రి పేర్ని నాని

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (21:59 IST)
ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ రంజాన్ మాసంలో సర్వ మానవాళి క్షేమం కోసం ప్రార్థనలు చేయాలని, రంజాన్ మాసంలో ఇంట్లోనే నమాజ్ చేసి కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ముస్లిం సోదరులను అభ్యర్ధించారు. 

శుక్రవారం మధ్యాహ్నం స్థానిక మల్కా పట్నం పరిసర ప్రాంతంలో  లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న 250 మంది పేదలకు రంజాన్ తోఫా నేషనల్ గోల్డ్ బాషా  ఆధ్వర్యంలో మంత్రి పేర్ని నాని  చేతుల మీదుగా అందచేశారు.

ఈ నెలాఖరున జరిగే రంజాన్ పండుగ రోజున ప్రతి ఒక్క ముస్లిం సోదరులు సంతోషంగా సేమియా చేసుకోవడానికి అవసరమయ్యే  సేమియా, నేతి ప్యాకెట్ , పంచదార , కిస్ మిస్ , జీడిపప్పు అందచేసిన బాషా మంచి మనస్సును అల్లా దీవిస్తారని మంత్రి పేర్ని నాని అన్నారు.

ఈ రంజాన్ తోఫా కార్యక్రమంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ అచ్చాబా , 19 వ వార్డు ఇంచార్జీ బూరుగ  రామారావు, షేక్ జిలాని బాషా, మాజీ కౌన్సిలర్ మేడికొండూరు మధు తదితరులు పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments