ఇంట్లోనే నమాజ్ చేసి కరోనా కట్టడి చేద్దాం: మంత్రి పేర్ని నాని

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (21:59 IST)
ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ రంజాన్ మాసంలో సర్వ మానవాళి క్షేమం కోసం ప్రార్థనలు చేయాలని, రంజాన్ మాసంలో ఇంట్లోనే నమాజ్ చేసి కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ముస్లిం సోదరులను అభ్యర్ధించారు. 

శుక్రవారం మధ్యాహ్నం స్థానిక మల్కా పట్నం పరిసర ప్రాంతంలో  లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న 250 మంది పేదలకు రంజాన్ తోఫా నేషనల్ గోల్డ్ బాషా  ఆధ్వర్యంలో మంత్రి పేర్ని నాని  చేతుల మీదుగా అందచేశారు.

ఈ నెలాఖరున జరిగే రంజాన్ పండుగ రోజున ప్రతి ఒక్క ముస్లిం సోదరులు సంతోషంగా సేమియా చేసుకోవడానికి అవసరమయ్యే  సేమియా, నేతి ప్యాకెట్ , పంచదార , కిస్ మిస్ , జీడిపప్పు అందచేసిన బాషా మంచి మనస్సును అల్లా దీవిస్తారని మంత్రి పేర్ని నాని అన్నారు.

ఈ రంజాన్ తోఫా కార్యక్రమంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ అచ్చాబా , 19 వ వార్డు ఇంచార్జీ బూరుగ  రామారావు, షేక్ జిలాని బాషా, మాజీ కౌన్సిలర్ మేడికొండూరు మధు తదితరులు పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments