Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధి కోసం పలు భాషలు నేర్చుకోవాలి.. రాజకీయాలు వద్దు : సీఎం చంద్రబాబు

ఠాగూర్
సోమవారం, 17 మార్చి 2025 (16:39 IST)
ఉపాధి కోసం పలు భాషలను నేర్చుకోవాలని, భాషతో రాజకీయాలు చేయొద్దని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంగ్లీష్ అనేది కేవలం కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే భాష మాత్రమేనని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషలో చదివి రాణించిన వారే ఎక్కువని ఆయన గుర్తు చేశారు. 
 
సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, రియల్ టైమ్ పీ-4 డాష్ బోర్డు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలను కూడా ఇందులోనే భాగస్వాములను చేశామని వెల్లడించారు. వారి నుంచి వచ్చిన అభిప్రాయాలను తీసుకునే నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేస్తామన్నారు. పీ-4ను ఉగాది రోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్టు చెప్పారు. 
 
మొత్తంగా 35 లక్షల మంది పేదరికంలో ఉంటే మొదటి దశలో 20 లక్షల మంది, రెండో దశలో 15 లక్షల మందిని పెడతామని తెలిపారు. వీరికి చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితాను కూడా సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా పీ-4 కార్యక్రమం సక్రమంగా అమలు కావాలని అన్నారు. 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళతామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments