Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉద్యోగం పేరుతో నయా మోసం... ఫేక్ కంపెలీ పేరుతో ఆఫర్ లెటర్... రూ.2.25 లక్షలు వసూలు

Advertiesment
Jobs

ఠాగూర్

, సోమవారం, 10 మార్చి 2025 (08:48 IST)
ఒక యుకుడుని కన్సెల్టెన్సీ పేరుతో మరో యువకుడు వినూత్న తరహాలో మోసం చేశాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.2.25 లక్షలు వసూలు చేసి ఆ తర్వాత నకిలీ కంపనీ ఆఫర్ లేఖ ఇచ్చాడు. తాను మోసపోయినట్టు తెలుసుకున్న ఆ యువకుడు చివరకు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుంటూరు జిల్లాకు చెందిన ఏ.సాయికుమార్ అనే యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. హైదరాబాద్ నగరంలోని వెంగళరావు నగర్‌‍ కాలనీలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే, సాయికుమార్‌కు కన్సల్టెన్సీ ఉద్యోగం ఇప్పిస్తానని జానీ అనే యువకుడు నమ్మబలికాడు. అమర్నాథ్ అనే కన్సల్టెన్సీ‌కి డబ్బులు కట్టించాడు. డబ్బులు చెల్లించిన మూడు నెలల తర్వాత ఓ కంపెనీ పేరుతో జూమ్ కాల్ ఇంటర్వ్యూ నిర్వహించి, ఆ కంపెనీ పేరుతో ఆఫర్ లెటర్ సాయి కుమార్‌కు పంపించాడు. 
 
అయితే, ఆ కంపెనీ గురించి సాయి కుమార్ ఆన్‌లైన్‌లో శోధించగా ఎక్కడా వివరాలు తెలియరాలేదు. దీంతో అనుమానం వచ్చిన సాయికుమార్.. అమర్నాథ్‌ను నిలదీశాడు. ఆ మరుక్షణం నుంచి అమర్నాథ్ పరారీలో ఉంటున్నాడు. దీంతో సాయికుమార్ గుంటూరు మధురానగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vijayashanthi: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి.. విజయం ఖాయమేనా?