Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పాజిటివ్ రోగిపై చిరుత దాడి, చిరుతకు కూడా వైరస్ సోకిందా?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (16:18 IST)
తిరుపతిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిరుతలు దాడికి దిగాయి. జూ పార్కు రోడ్డు ఎదురుగా మోటారు సైకిల్ పైన వెళుతున్న ఒక యువకుడిపై ఉన్నట్లుండి దాడి చేసింది చిరుత. ఈ దాడిలో యువకుడి కాళ్ళకు గాయాలయ్యాయి. తాను వెళుతున్న మోటారు సైకిల్‌ను అతి వేగంగా నడపడంతో చిరుత నుంచి తనను తాను కాపాడుకున్నాడు యువకుడు.
 
అయితే ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో యువకుడు కరోనా పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను తీసుకొనేందుకు వెళుతుండగా ఘటన జరిగింది. యువకుడు తల్లిదండ్రులు ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. అనుమానంతో రెండురోజుల క్రితమే తను పరీక్షలు చేయించుకున్నాడు.
 
రిపోర్టులు రాకపోవడంతో ఆ యువకుడు మోటారు సైకిల్ పైన జూపార్కు రోడ్డులో ఆసుపత్రికి వెళుతుండగా ఘటన జరిగింది. చిరుత యువకుడిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. అయితే చిరుత దాడి చేసిన వ్యక్తికి పాజిటివ్ ఉంటే చిరుతకు కరోనా సోకే అవకాశం ఉందన్న అనుమానాన్ని అటవీశాఖాధికారులు వ్యక్తం చేస్తున్నారు.
 
కానీ జంతువులకు కరోనా సోకే అవకాశం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ దట్టమైన అటవీ ప్రాంతంలోకి చిరుతను తరలించే ప్రయత్నం అటవీశాఖాధికారులు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments