కరోనా పాజిటివ్ రోగిపై చిరుత దాడి, చిరుతకు కూడా వైరస్ సోకిందా?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (16:18 IST)
తిరుపతిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిరుతలు దాడికి దిగాయి. జూ పార్కు రోడ్డు ఎదురుగా మోటారు సైకిల్ పైన వెళుతున్న ఒక యువకుడిపై ఉన్నట్లుండి దాడి చేసింది చిరుత. ఈ దాడిలో యువకుడి కాళ్ళకు గాయాలయ్యాయి. తాను వెళుతున్న మోటారు సైకిల్‌ను అతి వేగంగా నడపడంతో చిరుత నుంచి తనను తాను కాపాడుకున్నాడు యువకుడు.
 
అయితే ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో యువకుడు కరోనా పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను తీసుకొనేందుకు వెళుతుండగా ఘటన జరిగింది. యువకుడు తల్లిదండ్రులు ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. అనుమానంతో రెండురోజుల క్రితమే తను పరీక్షలు చేయించుకున్నాడు.
 
రిపోర్టులు రాకపోవడంతో ఆ యువకుడు మోటారు సైకిల్ పైన జూపార్కు రోడ్డులో ఆసుపత్రికి వెళుతుండగా ఘటన జరిగింది. చిరుత యువకుడిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. అయితే చిరుత దాడి చేసిన వ్యక్తికి పాజిటివ్ ఉంటే చిరుతకు కరోనా సోకే అవకాశం ఉందన్న అనుమానాన్ని అటవీశాఖాధికారులు వ్యక్తం చేస్తున్నారు.
 
కానీ జంతువులకు కరోనా సోకే అవకాశం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ దట్టమైన అటవీ ప్రాంతంలోకి చిరుతను తరలించే ప్రయత్నం అటవీశాఖాధికారులు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments