Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పాజిటివ్ రోగిపై చిరుత దాడి, చిరుతకు కూడా వైరస్ సోకిందా?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (16:18 IST)
తిరుపతిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిరుతలు దాడికి దిగాయి. జూ పార్కు రోడ్డు ఎదురుగా మోటారు సైకిల్ పైన వెళుతున్న ఒక యువకుడిపై ఉన్నట్లుండి దాడి చేసింది చిరుత. ఈ దాడిలో యువకుడి కాళ్ళకు గాయాలయ్యాయి. తాను వెళుతున్న మోటారు సైకిల్‌ను అతి వేగంగా నడపడంతో చిరుత నుంచి తనను తాను కాపాడుకున్నాడు యువకుడు.
 
అయితే ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో యువకుడు కరోనా పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను తీసుకొనేందుకు వెళుతుండగా ఘటన జరిగింది. యువకుడు తల్లిదండ్రులు ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. అనుమానంతో రెండురోజుల క్రితమే తను పరీక్షలు చేయించుకున్నాడు.
 
రిపోర్టులు రాకపోవడంతో ఆ యువకుడు మోటారు సైకిల్ పైన జూపార్కు రోడ్డులో ఆసుపత్రికి వెళుతుండగా ఘటన జరిగింది. చిరుత యువకుడిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. అయితే చిరుత దాడి చేసిన వ్యక్తికి పాజిటివ్ ఉంటే చిరుతకు కరోనా సోకే అవకాశం ఉందన్న అనుమానాన్ని అటవీశాఖాధికారులు వ్యక్తం చేస్తున్నారు.
 
కానీ జంతువులకు కరోనా సోకే అవకాశం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ దట్టమైన అటవీ ప్రాంతంలోకి చిరుతను తరలించే ప్రయత్నం అటవీశాఖాధికారులు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments