Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మళ్ళీ చిరుతపులి ప్రత్యక్షం, ఈసారి ఎక్కడంటే?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (22:17 IST)
తిరుమలలో జంతువుల సంచారం ఎక్కువగా కనబడుతోంది. నిత్యం రద్దీగా వుండే తిరుమల గిరులు భక్తులు లేక ఖాళీగా వుండటంతో జంతువులు యథేచ్ఛగా తిరిగేస్తున్నాయి. జింకలు, అడవిపందులు, చిరుతలు ఇలా తిరుమలలో జనం తిరిగే ప్రాంతంలోనే ప్రత్యక్షమవుతున్నాయి.
 
తిరుమలలోని పద్మావతినగర్ లోని అశ్విని ఆసుపత్రి వద్ద అర్థరాత్రి చిరుత సంచరించింది. ఇది మ్యూజియంకు సమీపంలో ఉంది. తిరుమలకు వచ్చే భక్తుల్లో ఎక్కువమంది ఈ ప్రాంతంలోనే దిగుతుంటారు. అయితే అలాంటి ప్రాంతంలో పెద్దగా జనం లేకపోవడంతో చీకటి అయితే చాలు తిరుమల మొత్తం నిర్మానుషం మారిపోవడంతో జంతువులు వచ్చేస్తున్నాయి.
 
వెలుతురు ఎక్కువగా ఉన్నా సరే నిర్మానుషమైన వాతావరణం కావడంతో జంతువులు ఇష్టానుసారం తిరిగేస్తున్నాయి. గత వారంరోజుల క్రితమే తిరుమల ఘాట్ రోడ్డులోనే చిరుత వాహనదారులపై దాడి చేసింది. అలాగే తిరుపతిలోని రెండు ప్రాంతాల్లో చిరుత హల్చల్ చేసింది.
 
ఇది కాస్త స్థానికులకు, భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చిరుతను దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు అటవీశాఖాధికారులు ప్రయత్నం చేశారు. కానీ చివరకు చిరుత జాడను గుర్తించలేకపోయారు. తాజాగా చిరుత తిరుమలలో మళ్ళీ ప్రత్యక్షమవడం.. అది కాస్తా సిసి.టివి ఫుటేజ్‌లో బయట పడటంతో భక్తుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sundeep Kishan: శివ మల్లాల నిర్మాణంలో సందీప్‌కిషన్‌ క్లాప్‌తో ప్రారంభమైన హ్రీం

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments