Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనకు ఎదురుదెబ్బ.. ఆ స్థలానికి చట్టబద్ధత లేదట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ రాజధాని అమరావతికి సమీపంలో అంటే గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని పవన్ భావించారు.

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (17:15 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ రాజధాని అమరావతికి సమీపంలో అంటే గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని పవన్ భావించారు. ఇందుకోసం కొంతమంది నుంచి స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. స్థలం దాతలకు కూడా ఇటీవల పవన్ సన్మానం కూడా చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. 
 
ఇపుడు ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరికి సమీపంలోని చినకాకానిలో జనసేన పార్టీకి కేటాయించిన స్థలం న్యాయపరమైన వివాదంలో చిక్కుకుంది. యార్లగడ్డ సుబ్బారావు వారసుల నుంచి జనసేన పార్టీ తీసుకున్న లీజుకు చట్ట బద్దత లేదంటూ, ఆ స్థలం వారసులుగా వున్న మైనారిటీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
దీంతో ముస్లిం మైనారిటీలు, యార్లగడ్డ సుబ్బారావు మధ్య స్థలంపై వివాదం చోటుచేసకుంది. భూమి వ్యవహారంలో స్టే ఉందని మైనార్టీలు జనసేనానికి విషయం తెలియజేశారు. స్థలం విషయంపై మైనార్టీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు. దీనిపై జనసేనకు చెందిన స్థానిక నేతలు లేదా హీరో పవన్ కళ్యాణ్ తరపున ప్రతినిధులు స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments