పవనా...? ఈ పని మీకు తగునా...? ఎవరు?

Webdunia
బుధవారం, 17 జులై 2019 (18:01 IST)
జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు వామపక్షాలతో కలిసి చేసిన హడావిడి అంతాఇంతా కాదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న ప్రచారమూ బాగానే సాగింది. మరికొందరైతే ఏకంగా పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతారని కూడా అనుకున్నారు. కానీ అంతా రివర్సయ్యింది. ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే జనసేన పార్టీ తరపున గెలిచారు.
 
దీంతో వామపక్షాలు, జనసేన పార్టీ నేతలు నిరుత్సాహానికి గురయ్యారు. కొన్నిరోజుల పాటు ఇరువురు సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా జనసేనాని తీసుకుంటున్న నిర్ణయాలపై వామపక్షాలు కన్నెర్ర చేస్తున్నాయట. ఎన్నికలకు ముందు తమతో పాటు కలిసి ఉండి ఉన్నట్లుండి బిజెపిలోకి వెళ్ళిపోవాలని పవన్ నిర్ణయించుకోవడమే ఇందుకు కారణమట.
 
ముందు నుంచి వామపక్షాలు నరేంద్రమోడీని వ్యతిరేకిస్తున్నాయి. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మోడీపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇలాంటి సమయంలో తమతో పాటు స్నేహభావంతో ఉన్న పవన్ కళ్యాణ్‌ మోడీతో కలవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి వామపక్షాలు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించేందుకు కూడా సిద్ధమైపోయారట వామపక్షాలు. మరి పవన్ కళ్యాణ్ రాజకీయ స్నేహితులకు ఏవిధంగా సమాధానం చెప్పి బుజ్జగిస్తారో వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments