Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో జనసేన-సీపీఎం పొత్తు.. త్వరలోనే తమ్మినేని-పవన్ భేటీ

ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా కలిసి పనిచేద్ధామని సీపీఎం జనసేనను ఓ లేఖలో కోరింది. తెలంగాణలోనూ జనసేనతో కలిసి పనిచేసేందుకు సుముఖత చూపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (10:19 IST)
ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా కలిసి పనిచేద్ధామని సీపీఎం జనసేనను ఓ లేఖలో కోరింది. తెలంగాణలోనూ జనసేనతో కలిసి పనిచేసేందుకు సుముఖత చూపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ నేపథ్యంలో తమ్మినేని విజ్ఞప్తిని జనసేన సానుకూలంగా స్పందించింది. 
 
తమ్మినేని వీరభద్రంతో చర్చించాలని జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ నిర్ణయం తీసుకొంది. ఏపీ రాష్ట్రంలో  సీపీఐ, సీపీఎంలతో కలిసి పనిచేస్తామని జనసేన ప్రకటించింది. ఈ మేరకు ఈ మూడు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. అయితే ఏ సీట్లలో ఏ పార్టీ పోటీ చేయాలనే విషయమై ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
 
మరోవైపు తెలంగాణలో కూడ ఏపీ తరహాలోనే కలిసి పనిచేయాలని సీపీఎం అభిప్రాయపడుతోంది. ఈ మేరకు  సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనసేనను కోరారు. తమ్మినేని చేసిన ప్రతిపాదనపై జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీ చర్చించింది. 
 
తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా తమ్మినేనితో నేరుగా చర్చించాలని జనసేన నిర్ణయించుకుంది. త్వరలోనే ఈ రెండు పార్టీల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో మురందస్తు ఎన్నికలకు కేసీఆర్ సన్నద్దమౌతున్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో తమ్మినేని చేసిన ప్రతిపాదన ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments