దేశ ద్రోహానికి నాయకులు... నటుడు శివాజీ

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (07:52 IST)
ప్రముఖ నటుడు శివాజీ.. పారిశ్రామికవేత్త మెగా కృష్ణారెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆయన దేశ ద్రోహానికి పాల్పడుతున్నారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదుల చేశారు.

ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేర్లతో ప్రజా ధనాన్ని దోచుకొని ముఖ్యమంత్రులు పంచుకుంటున్నారంటూ ప్రముఖ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి దేశద్రోహానికి పాల్పడుతున్నారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి ఈ వీడియోను విడుదల చేసే ధైర్యం తనకు ఉన్నా, దాన్ని ప్రసారం చేసే ధైర్యం రెండు రాష్ట్రాల్లోనే కాక, దేశంలో ఏ మీడియాకు లేదంటూ వ్యాఖ్యానించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలతో బస్సులను కొని దాంతో వచ్చే డబ్బులతో సొంత జేబులు నింపుకుంటున్నారని రాజకీయ నాయకులనుద్దేశించి అన్నారు.

ఓఎన్జీసీ రిగ్గుల కాంట్రాక్ట్​లోనూ అనేక అవకతవకలు జరిగాయనీ, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు త్వరలోనే బయటపెడతానని శివాజీ వెల్లడించారు. మెగా కృష్ణారెడ్డి కారణంగా భాజపాకు చెడ్డ పేరు వస్తోందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని వంద దేవుళ్లు చిత్రం నుంచి మెలోడీ గీతం విడుదల

Faria Abdullah: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా గాయపడ సింహం నుంచి బ్రైడ్ సాంగ్

సై ఫై థ్రిల్లర్ మూవీ కిల్లర్ నుంచి డా. పూర్వజ్ ఫస్ట్ లుక్

ఏ మతాన్ని తక్కువ చూపించలేదు : టొవినో థామస్- కెరీర్ లో స్పెషల్ మూవీ: కయదు లోహర్

King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments