దేశ ద్రోహానికి నాయకులు... నటుడు శివాజీ

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (07:52 IST)
ప్రముఖ నటుడు శివాజీ.. పారిశ్రామికవేత్త మెగా కృష్ణారెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆయన దేశ ద్రోహానికి పాల్పడుతున్నారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదుల చేశారు.

ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేర్లతో ప్రజా ధనాన్ని దోచుకొని ముఖ్యమంత్రులు పంచుకుంటున్నారంటూ ప్రముఖ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి దేశద్రోహానికి పాల్పడుతున్నారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి ఈ వీడియోను విడుదల చేసే ధైర్యం తనకు ఉన్నా, దాన్ని ప్రసారం చేసే ధైర్యం రెండు రాష్ట్రాల్లోనే కాక, దేశంలో ఏ మీడియాకు లేదంటూ వ్యాఖ్యానించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలతో బస్సులను కొని దాంతో వచ్చే డబ్బులతో సొంత జేబులు నింపుకుంటున్నారని రాజకీయ నాయకులనుద్దేశించి అన్నారు.

ఓఎన్జీసీ రిగ్గుల కాంట్రాక్ట్​లోనూ అనేక అవకతవకలు జరిగాయనీ, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు త్వరలోనే బయటపెడతానని శివాజీ వెల్లడించారు. మెగా కృష్ణారెడ్డి కారణంగా భాజపాకు చెడ్డ పేరు వస్తోందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments