అదుపుతప్పి బోల్తాపడ్డ లారీ.. ముగ్గురు మృతి

Webdunia
బుధవారం, 7 జులై 2021 (09:23 IST)
అదుపుతప్పి లారీ బోల్తాపడటంతో ముగ్గురు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చోటుచేసుకుంది.

గన్నవరం పోలీసులు, ట్రాఫిక్‌ సిబ్బంది ప్రమద స్ధలానికి చేరుకున్నారు. మృతులను తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన ఒకే కుటుంబంలోని రాజ్యలక్ష్మి (29), శ్రీనివాస్‌ (27), రోహిత్‌ (2) లుగా గుర్తించారు.

లారీని క్లీనర్‌ నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది క్రేన్‌ సాయంతో లారీని బయటకు తీస్తున్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments