Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో భారీగా అక్ర‌మ మ‌ద్యం స్వాధీనం

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (21:21 IST)
అక్రమ మద్యాన్ని అధిక మొత్తంలో స్వాధీనం చేసుకొని గుంటూరు రూరల్ పోలీసులు రికార్డ్ బ్రేక్ చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఎక్కడా లేనివిధంగా రూ.21,65,000 ల‌క్ష‌ల విలువైన 9,096 బాటిళ్ళను సీజ్ చేసి ఔరా అనిపించారు.

రవాణాకు ఉపయోగించిన వాటర్ ట్యాంకర్‌తో పాటు ఒక కారు, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని శనివారం గుంటూరులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్రమ మద్యం రవాణాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఆరుగురు వ్యక్తులు తెలంగాణా నుండి ట్యాంకర్ లో మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో రావడంతో తమ సిబ్బందిని అప్రమత్తం చేశామని, ఈ క్రమంలో మునుగోడు గ్రామం వద్ద అమరావతి సీఐ టి.విజయకృష్ణ, ఎస్సై రవీంద్రబాబుతో పాటు వారి సిబ్బంది అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేసి ఉపయోగించిన వాహనాలతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments