Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబును ఎన్టీఆర్ అండమాన్ జైలుకు పంపాలనేవారు.. లక్ష్మీపార్వతి

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (12:16 IST)
వైసీపీ నేత లక్ష్మీ పార్వతి టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఎన్టీఆర్ బ్రతికున్న రోజుల్లో చంద్రబాబుపై ఎలాంటి వ్యాఖ్యలు చేసేవారో లక్ష్మీ పార్వతి ప్రస్తావించారు.

మాజీ సీఎం ఎన్టీఆర్‌ చనిపోయిన రోజుల్లో చంద్రబాబు పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసేవారు. మళ్లీ తాను అధికారంలోకి వస్తే.. చంద్రబాబును తప్పకుండా అండమాన్‌ జైలుకు పంపించాలని ఉందని తనతో అన్నట్లు లక్ష్మీ పార్వతి గుర్తు చేసుకున్నారు.
 
చంద్రబాబుకు ప్రస్తుతం అదే గతి వస్తుందని ఆశిస్తున్నట్లు లక్ష్మీపార్వతి అన్నారు. ఏపీలో గత పాలనపై ఏర్పాటు చేసిన సిట్ ద్వారా వాస్తవాలన్నీ బయటకు వస్తాయని, త్వరలోనే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సుజనా ముగ్గరూ జైలుకెళ్లడం తాను కళ్లారా చూస్తానని ఆమె ఆరోపించారు. 
 
ఇకపోతే.. తెలుగు భాషాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. తెలుగు సాహిత్య పీఠాన్ని విశ్వ విద్యాలయంగా మార్చి అభివృద్ధి చేస్తామన్నారు.

అలాగే తెలుగు భాషతో పాటు, ఇంగ్లీషు కూడా సీఎం జగన్ ప్రాధాన్యమిస్తున్నారు. తెలుగు భాష అమ్మే.. కానీ.. అప్పుడప్పుడు కొన్ని మెళుకువలు పాటించాలని ఆమె సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments