Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోక కాలిన కుక్కల్లాగా మొరగకుండా లేఖలో ఏం వుందో చదవండి.. కేవీపీ

Webdunia
మంగళవారం, 7 మే 2019 (12:02 IST)
టీడీపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ మంత్రి దేవినేని ఉమతో పాటు పోలవరంపై ఓనమాలు కూడా తెలియని పండిత పుత్రులు తనను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్సార్ హయంలాలో పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకురావడంతో తాను కీలకంగా పనిచేశానన్నారు. 
 
పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకునే కోట్లాది మంది ఆంధ్రుల్లో తానూ ఒకడినని కేవీపీ అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తాను ఏపీ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాస్తే.. టీడీపీ నేతలు దిగజారుడు మాటలు మాట్లాడుతారా..? పార్టీ హైకమాండ్ ఆదేశించగానే తోక కాలిన కుక్కల్లాగా మొరగకుండా లేఖలో ఏం ఉందో చదవి స్పందించి ఉంటే బాగుండేదని కేవీపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
తనపై టీడీపీ నేతలు దిగజారి అసభ్య వ్యాఖ్యలు చేశారనీ, తాను వారిలా దిగజారి మాట్లాడలేనని స్పష్టం చేశారు. దేవినేని ఉమ కూడా తన లేఖలో పోలవరం ప్రాజెక్టు ఖర్చుపై వేసిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదని కేవీపీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును ఏపీ తీసుకోవడం ద్వారా ఎంత భారం రాష్ట్రంపై పడుతుందో ఉమ చెప్పలేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments