Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ జోన్ ఓ మహిళ ప్రాణాలు తీసింది.. ఎలాగంటే?

Webdunia
శనివారం, 2 మే 2020 (15:51 IST)
రెడ్ జోన్‌ ఓ మహిళ ప్రాణాలు తీసింది. కర్నూలులో ఓ మహిళ  వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలను కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల పట్టణానికి చెందిన ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు ఆయాసంగా ఉండటంతో కుటుంబసభ్యులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో ఆమెకు చికిత్స చేసేందుకు అక్కడున్న వైద్య సిబ్బంది నిరాకరించారు. ఇంకా రెడ్ జోన్‌లో వున్నవారికి వైద్యం అందించబోమన్నారు. 
 
ఒక్క ఇంజక్షన్ ఇచ్చి మహిళా పేషంట్‌ను ఇంటికి పంపించేశారు. అయితే ఇంటికి వెళ్లిన కాసేపటికే ఆ మహిళ మృతి చెందింది. దీంతో ఆస్పత్రి తీరుపై కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. తన తల్లికి వైద్యం అందించి ఉంటే బతికి ఉండేందని కొడుకు ఆరోపిస్తున్నాడు. తల్లి మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు కర్నూలులో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments