Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ జోన్ ఓ మహిళ ప్రాణాలు తీసింది.. ఎలాగంటే?

Webdunia
శనివారం, 2 మే 2020 (15:51 IST)
రెడ్ జోన్‌ ఓ మహిళ ప్రాణాలు తీసింది. కర్నూలులో ఓ మహిళ  వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలను కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల పట్టణానికి చెందిన ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు ఆయాసంగా ఉండటంతో కుటుంబసభ్యులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో ఆమెకు చికిత్స చేసేందుకు అక్కడున్న వైద్య సిబ్బంది నిరాకరించారు. ఇంకా రెడ్ జోన్‌లో వున్నవారికి వైద్యం అందించబోమన్నారు. 
 
ఒక్క ఇంజక్షన్ ఇచ్చి మహిళా పేషంట్‌ను ఇంటికి పంపించేశారు. అయితే ఇంటికి వెళ్లిన కాసేపటికే ఆ మహిళ మృతి చెందింది. దీంతో ఆస్పత్రి తీరుపై కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. తన తల్లికి వైద్యం అందించి ఉంటే బతికి ఉండేందని కొడుకు ఆరోపిస్తున్నాడు. తల్లి మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు కర్నూలులో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments