Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ నేరగాడి చేతిలో మోసపోయిన వైకాపా ఎంపీ - రూ.97 వేలు మాయం

Webdunia
బుధవారం, 4 మే 2022 (08:21 IST)
ఓ సైబర్ నేరగాడి చేతిలో సాక్షాతో ఓ ఎంపీ మోసపోయాడు. ఫలితంగా ఎంపీ ఖాతా నుంచి రూ.97 వేలను సైబర్ నేరగాడు క్షణాల్లో ఖాళీ చేశాడు. మోసపోయిన వైకాపా ఎంపీ పేరు సంజీవ్ కుమార్. వైకాపా ఎంపీ. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఎంపీ సంజీవ్ కుమార్‌కు మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని, దాన్ని వెంటనే పాన్ నంబరుతో అప్‌డేట్ చేసుకోవాలంటూ ఓ సందేశం వచ్చింది. ఇందుకోసం కింది లింక్‌ను క్లిక్ చేయాలని అందులో ఉంది. ఈ సందేశం నిజమేనని నమ్మిన ఎంపీ లింక్ ఓపెన్ చేసి వివరాలను ఫిల్ చేసి సెండ్ చేశాడు. ఆ వెంటనే ఆయనకు మొబైల్ నంబరుకు ఓటీవీ వచ్చింది. 
 
ఆ మరుక్షణం సైబర్ నేరగాడు ఫోన్ చేసి తాను హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని బ్యాంకు ఖాతా వివరాలను అప్‌డేట్ చేసేందుకు మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పాలని కోరడంతో సదరు ఎంపీ ఆ ఓటీపీని చెప్పాడు. ఆ తర్వాత కాసేపటికే ఒకసారి రూ.48,700, మరో దఫా రూ.48,999 డ్రా అయినట్టు ఎంపీకి ఫోను సందేశం వచ్చింది. 
 
అది చూసి హతాశుడైన ఎంపీ తాను సైబర్ నేరగాడి చేతిలో మోసపోయినట్టు గ్రహించి బ్యాంకుకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. అలాగే, సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. సైబర్ నేరగాడు మంత్రి ఖాతా నుంచి రూ.97699 కాజేసినట్టు తేలింది. పోలీసులు కేసును విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments