Webdunia - Bharat's app for daily news and videos

Install App

నో ఫోన్ జోన్లుగా టెన్త్ పరీక్షా కేంద్రాలు - ఏపీ సర్కారు ఆదేశాలు

Webdunia
బుధవారం, 4 మే 2022 (08:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రోజూ ప్రశ్నపత్రం లీక్ అవుతోంది. పరీక్ష ప్రారంభమైన కొన్న నిమిషాల్లోనే వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతుంది. పరీక్ష నిర్వహించే ఇన్విజిలేటర్లు, ఎగ్జామినర్లే ఈ ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారు. దీంతో ప్రశ్నపత్రం లీక్ కాకుండా, విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా వంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
పదో తరగతి పరీక్ష జరిగే పరీక్షా కేంద్రాల్లోకి ఇక నుంచి ఫోన్లు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు పదో తరగతి పరీక్షా కేంద్రాలను నో ఫోన్ జోన్లుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీచేసింది. చివరకు పాఠశాల చీఫ్ సూపరింటెండెంట్లు కూడా పరీక్ష కేంద్రంలోకి ఫోన్లు తీసుకురాకూడదని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. 
 
పరీక్షా కేంద్రాల్లో ఫోన్లతో పాటు ఐప్యాడ్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇయర్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కనిపించినా వాటిని స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే, ప్రశ్నపత్రంపై విద్యార్థిని హాల్ టిక్కెట్ నంబరు, పరీక్షా కేంద్రం నంబరు కూడా విధిగా వేసేలా చూడాలని ఇన్విజిలేటర్లను ఆదేశించింది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments