Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారుడిని సంసారానికి పనికిరాకుండా చేసిందనీ కోడలు హత్య?

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (16:59 IST)
కర్నూలు జిల్లాలో జంట హత్యలు చోటుచేసుకున్నాయి. నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద జంట హత్యలు కలకలం రేపాయి. తల్లీ కుమార్తెను గుర్తు తెలియని దండగులు హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక భవనంలోని పై అంతస్తులో తల్లిని, కింది అంతస్తులో కుమార్తెను హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. 
 
అలాగే, హత్యకు గురైన వారిని రుక్మిణి, రమాదేవిలుగా గుర్తించారు. కాగా, ఈ జంట హత్యల ఘటనలో రమాదేవి తండ్రి వెంకటేశ్వర రావుకు కూడా గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈయన కోలుకుంటేగానీ ఈ హత్యలకు సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది. 
 
కాగా, కర్నూలుకి చెందిన శ్రావణ్‌కు రుక్మిణిని ఇచ్చి వివాహం చేసారు. హైదరాబాద్ నగరంలో బ్యాంకు ఉద్యోగం చేస్తూ వచ్చిన శ్రవణ్‌కు ఆపరేషన్ తర్వాత వివాహమైంది. దీంతో తన కుమారుడిని సంసారానికి పనికిరాకుండా చేశావంటూ కక్షగట్టిన శ్రవణ్ తండ్రి ప్రసాద్.. కోడలు రుక్మిణి, ఆమె తల్లి రమాదేవిలను హత్య చేసివుంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments