Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొగలు కక్కుతున్న సాంబారు పాత్రలో పడిన యూకేజీ బాలుడు మృతి.. ఎలా?

Webdunia
గురువారం, 14 నవంబరు 2019 (10:15 IST)
కర్నూలు జిల్లాలో విషాదకర సంఘటన జరిగింది. వేడివేడి సాంబారు పాత్రలో పడిన ఓ యూకేజీ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వరుసలో నిలబడివుండగా, వెనుక ఉన్న విద్యార్థి నెట్టివేయడంతో ఈ ఘటన జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లెకు చెందిన శ్యాంసుందర్‌రెడ్డి, కల్పన అనే దంపతులకు ఆరేళ్ళ పురుషోత్తం రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. ఈ బాలుడు పాణ్యంలోని విజయానికేతన్ రెసిడెన్షియల్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. 
 
రోజూలాగానే బుధవారం మధ్యాహ్నం పురుషోత్తం భోజనం కోసం క్యూలో నిల్చున్నాడు. ఈ క్రమంలో వెనకున్న విద్యార్థులు నెట్టివేయడంతో అదుపుతప్పిన చిన్నారి పురుషోత్తం ముందున్న పొగలు కక్కుతున్న సాంబారు పాత్రలో పడిపోయాడు.
 
ఆ తర్వాత పాఠశాల సిబ్బంది ఆ బాలుడిని రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే విద్యార్థి శరీరంపై బొబ్బలు రావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి ప్రాణాలు విడిచాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాలు బుధవారం రాత్రి పాఠశాల వద్ద ఆందోళనకు దిగాయి. పాఠశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరి హర వీరమల్లు సినిమా పై తప్పుడు ప్రచారం - పవన్ స్థాయిని ఎవరూ తగ్గించలేరు

Nabha: నేచర్ కి రుణపడి ఉంటానని ఎమోషనల్ గా పోస్ట్ చేసిన నభా నటేష్

Vijayashanti: తెలుగు హీరోలు బ్రాండ్ మైండ్ కాదు- ఈర్ష ఎక్కువ : విజయశాంతి

RT76 : రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం - 2026 సంక్రాంతికి రిలీజ్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments