Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు పెళ్లైంది.. ఇక వద్దని మొత్తుకున్నా.. వినలేదు.. చంపేసింది..

మాజీ ప్రియుడే. కానీ పెళ్లై, పిల్లలు కలిగాక వివాహేతర సంబంధానికి స్వస్తి చెప్పాలనుకుంది ఆ మహిళ. అయితే మాజీ ప్రియుడి వేధింపులు అధికం కావడంతో ఇక చేసేది లేక అతడిని హత్య చేసి పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘ

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (11:33 IST)
మాజీ ప్రియుడే. కానీ పెళ్లై, పిల్లలు కలిగాక వివాహేతర సంబంధానికి స్వస్తి చెప్పాలనుకుంది ఆ మహిళ. అయితే మాజీ ప్రియుడి వేధింపులు అధికం కావడంతో ఇక చేసేది లేక అతడిని హత్య చేసి పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిడ్జూరు గ్రామానికి చెందిన మహిళ (42) గ్రామంలో కూలీపని చేసుకుని జీవనం సాగిస్తోంది. 
 
ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన గొళ్ల విజయుడుతో ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉండేది. తన కుమారుడికి, కుమార్తెకు వివాహమైందని.. ఈ సంబంధానికి స్వస్తి పలికాలని చెప్పినా అతను వినేవాడు కాదు. 
 
తన కోర్కె తీర్చాలంటూ వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమం ఆగస్టు 14వ తేదీన రాత్రి విజయుడు ఆ మహిళ ఇంటికెళ్లిన విజయుడు.. తనతో సంబంధం కొనసాగించాలని ఆమెతో గొడవకు దిగాడు. వీరిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. 
 
కోపంతో ఆ మహిళ రోకలిబండతో విజయుడి తలపై కొట్టింది. అంతేకాదు కత్తితో దాడి చేసింది. ఆపై భయంతో ఇంటికి తాళం వేసి పారిపోయింది. చివరికి బుధవారం సాయంత్రం పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments