Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. విశాఖకు సీఎం జగన్.. కేటీఆర్ ట్వీట్..

Webdunia
గురువారం, 2 మార్చి 2023 (15:11 IST)
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం విశాఖపట్నం సిద్దమైంది. ఈ సదస్సులో దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారు.  
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం రాత్రి విశాఖ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటూ అక్కడే ఉంటారు. ఈ సమ్మిట్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రూ. రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.  
 
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో తొలి రోజు మార్చి 3న శుక్రవారం ఉదయం 9.15 గంటలకు సీఎం జగన్‌ అధ్యక్షత జీఐఎస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది.
 
ఇదిలా వుంటే.. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. విశాఖలో ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 
 
ఇంకా తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఉండాలని కేటీఆర్‌ ఆశించారు. ఈ సదస్సుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్‌కు ఏపీకి చెందిన వైఎస్సార్‌సీపీ అభిమానులు, నెటిజన్లు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments