Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు చేయకపోతే.. ఉలికిపాటు ఎందుకు చంద్రమా? కేటీఆర్ సూటి ప్రశ్న

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (11:48 IST)
తెలుగు రెండు రాష్ట్రాల అధికార పార్టీల మధ్య ఐటీ గ్రిడ్ సంస్థ డేటా చోరీపై మాటల యుద్ధం కొనసాగుతోంది. డేటా దుర్వినియోగంపై ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. 
 
డేటా స్కామ్‌పై ట్విటర్‌ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపీ పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుంది అనే కదా మీ భయం చంద్రబాబు.? భయంతోనే విచారణకు ముందుకు రావడంలేదు? పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపీ ప్రభుత్వం ఓ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవడమేనంటూ కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు. 
 
'ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే' అన్నట్లు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద ఏడుపులు ఎందుకు చంద్రబాబు? తెలంగాణ పోలీసుల దర్యాప్తునకు ఏపీ పోలీసులు అడ్డుకోవడం, కోర్టులో తప్పుడు పిటీషన్లు వేయడం వంటి పరిణామాలు చూస్తుంటే.. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించడంలో చంద్రబాబు పాత్రను పరోక్షంగా నిర్దారిస్తుంది. ఈ అంశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కె. తారక రామారావు డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments