Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక సుఖానికి అడ్డుగా ఉన్నారనీ.. ఇద్దరు పిల్లల్ని చంపిన కసాయి తల్లి...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (14:16 IST)
పరాయి వ్యక్తితో పడకసుఖం పంచుకునేందుకు ఓ తల్లి కిరాతక చర్యకు పాల్పడింది. తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత అనారోగ్యంతో చనిపోయినట్టుగా ఇరుగుపొరుగువారిని నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ దారుణం కృష్ణా జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని పెడన 15వ వార్డుకు చెందిన ఓ వివాహిత అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడుని ఇంటికి పిలిపించి శృంగారంలో పాల్గొంటూ వచ్చింది. 
 
అయితే, ఈమెకు ప్రశాంతి (5), దివ్య (3) అనే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ప్రియుడు ఇంటికి వచ్చిన సమయంలో ఆతనితో ఏకాంతంగా గడిపేందుకు ఇద్దరు పిల్లలు అడ్డుగా ఉండేవారు. దీంతో ఇద్దరు పిల్లలను రెండు రోజుల వ్యవధిలో హత్య చేసి, అనారోగ్యంతో చనిపోయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. 
 
ఇద్దరు పిల్లలు రెండు రోజుల వ్యవధిలో చనిపోవడంతో అనుమానించిన బంధువులు ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు... ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. గతంలో తన భర్తను కూడా ఇలాగే చంపిందని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments