Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందివాడ మహిళా ఎస్ఐ భర్త అనుమానాస్పద మృతి!

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (09:41 IST)
కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ పామర్తి శిరీష భర్త బి.అశోక్ (30) ఆదివారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందారు. అశోక్ ఇంట్లో ఉరేసుకోగా గుర్తించిన భార్య శిరీష, ఆమె తరపు బంధువులు వెంటనే గుడివాడ ఏలూరు రోడ్డులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. 
 
ఏలూరుకు చెందిన శిరీష గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన బి.అశోక్ రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిది కులాంతర వివాహం. ఏడాది వయసు గల ఒక కుమార్తె ఉంది. శిరీష మచిలీపట్నంలోని స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పని చేస్తూ నాలుగు నెలల క్రితమే నందివాడకు బదిలీపై వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త అనుమానాస్పదంగా చనిపోవడం ఇపుడు కలకలం రేపింది. మరోవైపు, అధికార పార్టీ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు మృతుని కుటుంబ సభ్యులతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments