Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందివాడ మహిళా ఎస్ఐ భర్త అనుమానాస్పద మృతి!

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (09:41 IST)
కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ పామర్తి శిరీష భర్త బి.అశోక్ (30) ఆదివారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందారు. అశోక్ ఇంట్లో ఉరేసుకోగా గుర్తించిన భార్య శిరీష, ఆమె తరపు బంధువులు వెంటనే గుడివాడ ఏలూరు రోడ్డులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. 
 
ఏలూరుకు చెందిన శిరీష గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన బి.అశోక్ రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిది కులాంతర వివాహం. ఏడాది వయసు గల ఒక కుమార్తె ఉంది. శిరీష మచిలీపట్నంలోని స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పని చేస్తూ నాలుగు నెలల క్రితమే నందివాడకు బదిలీపై వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త అనుమానాస్పదంగా చనిపోవడం ఇపుడు కలకలం రేపింది. మరోవైపు, అధికార పార్టీ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు మృతుని కుటుంబ సభ్యులతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments