Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ కుమారుడు అన్నాడు.. వివాహితను అలా వేధించాడు..

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (12:05 IST)
వివాహితను స్నేహం చేసుకున్న ఓ వ్యక్తి ఆమెను వేధింపులకు గురిచేశాడు. తనను తాను ఎమ్మెల్సీ కుమారుడు అని పరిచయం చేసుకున్నాడు. అలా వివాహితతో ఏర్పడిన స్నేహాన్ని అదనుగా తీసుకుని డబ్బుల కోసం వేధించాడు. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కొండాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత (30)కి కొంత కాలం క్రితం భరత్‌కుమార్ అలియాస్ చింటూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. భరత్ కుమార్ తనను తాను ఎమ్మెల్సీ కొడుకుగా పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. దీనిని అవకాశంగా తీసుకున్న నిందితుడు తనలోని అసలు రూపాన్ని బయటకు తీశాడు. 
 
తనకు వెంటనే రూ. 15 లక్షలు ఇవ్వాలని వేధించడం మొదలుపెట్టాడు. ఇవ్వకుంటే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తానని బెదిరించాడు. అతడి వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments