Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపల్లి పీర్ల పంజాను దర్శించిన బిజెపి నాయ‌కులు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (09:57 IST)
మొహరం పండగ సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఖిల్లా రోడ్ లో ఏర్పాటు చేసిన పీర్ల పంజాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సందర్శించారు.

ఆయనతో పాటు ఎమ్మెల్సీ మాధవ్, పార్లమెంట‌రీ పార్టీ అధ్యక్షుడు బబ్బురి శ్రీ రామ్, బిజెపి మైలవరం ఇంచార్జ్ నూతలపాటి బాల, బిజెపి మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ, మౌలాలి, నాగుల్ మీరా, జనసేన అధికార ప్రతినిధి అక్కల గాంధీ ఇతర నాయకులు పాల్గొన్నారు. బిజెపి విజయవాడ పార్లమెంటరీ మైనార్టీ మోర్చా కార్యదర్శి సుభాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా అతిథులను సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఘనంగా సన్మానించారు.

అనంతరం పీర్ల పంజా వద్ద దేశం సౌభాగ్యంగా ఉండాలని ప్రజలందరూ కరోనా కష్టాలు తొలగిపోయి ప్రశాంతంగా జీవించాలని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయ‌కులు మాట్లాడుతూ. సత్యం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని మహమ్మద్ ప్రవక్త మనవలు చూపిన మార్గంలో ముస్లింలందరూ నడవాలని, అల్లా దయతో భారత దేశం మొత్తం సుభిక్షంతో వర్ధిల్లాలని కోరుకున్న మని, కొండపల్లి పంజా ను సందర్శించడం ఆనందకరం అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments