Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక పూర్తి.. వైకాపా నుంచి జోగి రాము

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (13:51 IST)
kondapalli
కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్‌ పర్సన్ ఎన్నిక పూర్తయ్యింది. వైకాపా నుంచి ఛైర్ పర్సన్ అభ్యర్థిగా జోగి రాము వున్నారు. టీడీపీ నుంచి చిట్టిబాబు బరిలో నిలిచారు. వైస్ ఛైర్మన్ ఎన్నికలో భాగంగా ఈ ఫలితాన్ని ఎన్నికల అధికారులు హైకోర్టుకు నివేదించనున్నారు. ఛైర్ పర్సన్ పదవి ఏ పార్టీకి దక్కిందోననే ఉత్కంఠ కొనసాగుతోంది.
 
గత రెండు రోజులుగా కొండపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. మంగళవారం టీడీపీ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేయగా విచారణ జరిగింది. మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ నిలిపివేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
కొండపల్లి మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అధికారి, విజయవాడ సీపీలు కోర్టుకు రావాలని ఆదేశించింది. బుధవారం ఎన్నిక నిర్వహించాలని.. ఆ ఫలితాలను కోర్టుకు నివేదించాలని సూచించింది. దీంతో భారీ బందోబస్తు మధ్య ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు.
 
మొత్తం 29 వార్డుల్లో 14 వార్డులు వైసీపీ, 14 వార్డులు టీడీపీ గెలిస్తే ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. అయితే ఆ గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి లక్ష్మి టీడీపీకి మద్దతు పలికారు. దీంతో టీడీపీ బలం 15కు.. వైఎస్సార్‌సీపీ బలం 14కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments