Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక పూర్తి.. వైకాపా నుంచి జోగి రాము

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (13:51 IST)
kondapalli
కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్‌ పర్సన్ ఎన్నిక పూర్తయ్యింది. వైకాపా నుంచి ఛైర్ పర్సన్ అభ్యర్థిగా జోగి రాము వున్నారు. టీడీపీ నుంచి చిట్టిబాబు బరిలో నిలిచారు. వైస్ ఛైర్మన్ ఎన్నికలో భాగంగా ఈ ఫలితాన్ని ఎన్నికల అధికారులు హైకోర్టుకు నివేదించనున్నారు. ఛైర్ పర్సన్ పదవి ఏ పార్టీకి దక్కిందోననే ఉత్కంఠ కొనసాగుతోంది.
 
గత రెండు రోజులుగా కొండపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. మంగళవారం టీడీపీ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేయగా విచారణ జరిగింది. మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ నిలిపివేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
కొండపల్లి మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అధికారి, విజయవాడ సీపీలు కోర్టుకు రావాలని ఆదేశించింది. బుధవారం ఎన్నిక నిర్వహించాలని.. ఆ ఫలితాలను కోర్టుకు నివేదించాలని సూచించింది. దీంతో భారీ బందోబస్తు మధ్య ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు.
 
మొత్తం 29 వార్డుల్లో 14 వార్డులు వైసీపీ, 14 వార్డులు టీడీపీ గెలిస్తే ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. అయితే ఆ గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి లక్ష్మి టీడీపీకి మద్దతు పలికారు. దీంతో టీడీపీ బలం 15కు.. వైఎస్సార్‌సీపీ బలం 14కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments