Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతికున్నపుడు వేధించి.. ఇపుడు లాంఛనాలు ఎందుకు? కోడెల ఫ్యామిలీ ప్రశ్న

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (09:31 IST)
ఇటీవల హైదరాబాద్ నగరంలో ఆత్మహత్య చేసుకున్న ఏపీ మాజీ స్పీకర్, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద రావు అంత్యక్రియలను పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కోరారు. దీంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసేందుకు గుంటూరు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. 
 
అయితే, కోడెల కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలు తమకేమి వద్దని తేల్చి చెప్పారు. బతికున్న సమయంలో వేధించి, ఇప్పుడు లాంఛనాలు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. కోడెల కుటుంబీకులెవరూ ప్రభుత్వ మొక్కుబడి లాంఛనాన్ని అందుకునేందుకు సిద్ధంగా లేరని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, కోడెల అంత్యక్రియలు ఆయన అభివృద్ధి చేసిన స్వర్గపురిలోనే బుధవారం మధ్యాహ్నం జరుగనున్నాయి. ఇందుకోసం టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. అదేసమయంలో తమ అభిమాన నేతకు కడసారి నివాళులు అర్పించేందుకు అభిమానులు పోటెత్తారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 144 సెక్షన్‌ను పోలీసులు అమలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

తర్వాతి కథనం
Show comments