Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టామని చెబుతున్నా వారికి సిగ్గులేదు : కొడాలి నాని

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (22:13 IST)
ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టామని చెబుతున్న వారికి ఏమాత్రం సిగ్గు లేకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనుక తిరుగుతున్నారని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని గురువారం కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఒక 420 అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరిన చంద్రబాబు.. ఆయన బతికుండగానే సీఎం పదవి నుంచి తప్పించారని అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెడతాడని చంద్రబాబును ఉద్దేశించిన ఎన్టీఆర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. 
 
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం సీటుతో పాటు టీడీపీ పార్టీని కూడా లాక్కున్నాడని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టామని చెబుతున్న వాళ్లంతా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు వెనుక తిరుగుతున్నారన కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ తరహాలో పౌరుషం ఉన్న వ్యక్తి ఒక్క హరికృష్ణ మాత్రమేనని అన్నారు. అలాగే, ఎన్టీఆర్‌లా సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్ అని అన్నారు. చంద్రబాబుకు స్వార్థం ఎక్కువన్నారు. అందుకే ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతుంటారని కొడాలి నాని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments