Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టామని చెబుతున్నా వారికి సిగ్గులేదు : కొడాలి నాని

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (22:13 IST)
ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టామని చెబుతున్న వారికి ఏమాత్రం సిగ్గు లేకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనుక తిరుగుతున్నారని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని గురువారం కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఒక 420 అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరిన చంద్రబాబు.. ఆయన బతికుండగానే సీఎం పదవి నుంచి తప్పించారని అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెడతాడని చంద్రబాబును ఉద్దేశించిన ఎన్టీఆర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. 
 
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం సీటుతో పాటు టీడీపీ పార్టీని కూడా లాక్కున్నాడని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ రక్తం పంచుకుని పుట్టామని చెబుతున్న వాళ్లంతా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు వెనుక తిరుగుతున్నారన కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ తరహాలో పౌరుషం ఉన్న వ్యక్తి ఒక్క హరికృష్ణ మాత్రమేనని అన్నారు. అలాగే, ఎన్టీఆర్‌లా సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్ అని అన్నారు. చంద్రబాబుకు స్వార్థం ఎక్కువన్నారు. అందుకే ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతుంటారని కొడాలి నాని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments