Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు రూపాయల కోసం దారుణంగా చంపేశాడు, ఎక్కడ?

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (16:44 IST)
ఇద్దరి మధ్య చిన్న తగాదా కాస్త ఒక ప్రాణాన్ని బలిగొంది. కేవలం రెండు రూపాయలకు ఘర్షణ పడి చివరకు ప్రాణం తీసుకున్నారు. కాకినాడలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. కాకినాడ రూరల్ మండలం వలసపాకకు చెందిన సాంబమూర్తి స్థానికంగా సైకిల్ పంక్చర్ షాపు నడుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సువర్ణరాజు తన స్నేహితులతో కలిసి సాంబమూర్తి సైకిల్ షాప్ వద్దకు వచ్చి సైకిల్‌కు గాలి కొట్టించుకున్నాడు.
 
గాలి కొట్టించుకున్న తరువాత డబ్బులు ఇవ్వలేదు. అక్కడ నుంచి కొద్దిదూరం వెళ్లిపోయాడు. దీంతో సాంబమూర్తి డబ్బులు ఇవ్వాలని సువర్ణరాజును అడిగాడు. మర్చిపోయాను.. ఇదిగో డబ్బులు అంటూ ఇవ్వబోయాడు. రెండు రూపాయలు కూడా మర్చిపోయావా అంటూ సాంబమూర్తి ఎగతాళిగా మాట్లాడాడు.
 
దీంతో సువర్ణరాజుకు కోపమొచ్చింది. సాంబమూర్తితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చివరకు సాంబమూర్తి షాపులోని ఇనుప సామాన్లు తీసుకున్న సువర్ణరాజు అతడిపై దాడికి దిగాడు. దీంతో సాంబమూర్తి అక్కడికక్కడే చనిపోయాడు. కాకినాడ రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments