Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు రూపాయల కోసం దారుణంగా చంపేశాడు, ఎక్కడ?

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (16:44 IST)
ఇద్దరి మధ్య చిన్న తగాదా కాస్త ఒక ప్రాణాన్ని బలిగొంది. కేవలం రెండు రూపాయలకు ఘర్షణ పడి చివరకు ప్రాణం తీసుకున్నారు. కాకినాడలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. కాకినాడ రూరల్ మండలం వలసపాకకు చెందిన సాంబమూర్తి స్థానికంగా సైకిల్ పంక్చర్ షాపు నడుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సువర్ణరాజు తన స్నేహితులతో కలిసి సాంబమూర్తి సైకిల్ షాప్ వద్దకు వచ్చి సైకిల్‌కు గాలి కొట్టించుకున్నాడు.
 
గాలి కొట్టించుకున్న తరువాత డబ్బులు ఇవ్వలేదు. అక్కడ నుంచి కొద్దిదూరం వెళ్లిపోయాడు. దీంతో సాంబమూర్తి డబ్బులు ఇవ్వాలని సువర్ణరాజును అడిగాడు. మర్చిపోయాను.. ఇదిగో డబ్బులు అంటూ ఇవ్వబోయాడు. రెండు రూపాయలు కూడా మర్చిపోయావా అంటూ సాంబమూర్తి ఎగతాళిగా మాట్లాడాడు.
 
దీంతో సువర్ణరాజుకు కోపమొచ్చింది. సాంబమూర్తితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చివరకు సాంబమూర్తి షాపులోని ఇనుప సామాన్లు తీసుకున్న సువర్ణరాజు అతడిపై దాడికి దిగాడు. దీంతో సాంబమూర్తి అక్కడికక్కడే చనిపోయాడు. కాకినాడ రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments