Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిండర్ చాక్లెట్లలో ప్రమాదకర బ్యాక్టీరియా - 151 మందికి అస్వస్థత

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (16:25 IST)
చిన్నారుల నుంచి పెద్దల వరకు అమితంగా ఇష్టపడే కిండర్ చాక్లెట్లలో ప్రమాదకర సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది. ఈ చాక్లెట్లను ఆరగించిన 151 మంది చిన్నారులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన బెల్జియం దేశంలోని అర్లోన్ నగరంలో జరిగింది. 
 
ఫెర్రెరో కార్పొరేట్ ప్లాంట్‌లో తయారయ్యే జాయ్ చాక్లెట్లు ఆరగించిన చిన్నారుల్లో 151 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ చాక్లెట్లను ఆరగించిన చిన్నారులు అతిసారం, వాంతులతో బాధపడుతుండటాన్ని వారి తల్లిదండ్రులు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా, యూఎస్ ఆహార భద్రతా న్యాయ సంస్థ నివేదిక ప్రకారం 2021 డిసెంబరులో చాక్లెట్ల తయారీ పదార్థాలలో సాల్మొనెల్లా టెఫి మ్యురియమ్ అనే బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు. అలాంటి పదార్థాలతో తయారైన కిండర్ చాక్లెట్లను తినడం వల్ల చిన్నారులు అస్వస్థతకు లోనవుతున్నట్టు పేర్కొంది. సాల్మొనెల్లా జాతి బ్యాక్టీరియా చాలా ప్రమాదకరమైనదిగా యూఎస్ ఆహార సంస్థ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments