Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య.. శవం లభించక...

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (16:28 IST)
ఇటీవలికాలంలో కొందరు తమ ప్రియుల కోసం భర్తలను, ప్రియురాళ్ల కోసం భార్యను హత్య చేస్తున్నారు. ఈ తరహా హత్యలు తరచుగా తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఖమ్మంలో ఓ భార్య తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. మృతదేహాన్ని ఖమ్మం నుంచి ఆంధ్రాకు తీసుకొచ్చి ఓ చేపల చెవురులో పడేసింది. ఆ చేపల చెరువు యజమాని ఆ శవాన్ని వాగులో పడేశాడు. దీంతో ఆ శవం ఇపుడు ఎక్కడుందో కనిపించలేదు. దాని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎంతకీ ఆ శవం లభించకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం అర్బన్ మండలం వైఎస్ఆర్ నగర్‌కు చెందిన సాయి చరణ్ (28) అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ కలిసి సంతోషంగా జీవిస్తూ వచ్చారు. ఈ క్రమంలో సాయి చరణ్ వద్ద పని చేసే ఓ యువకుడితో అతని భార్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఓ రోజున వారిద్దరూ కలిసివుండటాన్ని సాయిచరణ్ కళ్లారా చూశాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 
 
దీంతో తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేలా భార్య ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఖమ్మ నగరంలోని త్రీటౌన్ పరిధిలోని ప్రకాశ నగర్ వంతెన వద్ద మద్యం సేవించే సమయంలో సాయి చరణ్‌ను హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని చేపల వ్యర్థాలు తరలించే డ్రమ్ముల్లో ఏపీలోని విజయవాడ - తిరుపూరు మధ్యలో ఉన్న చీమలపాడు సమీపానికి తరలిచారు. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అయితే పోలీసులకు మృతుని భార్యపై అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. దీంతో ఆమెతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేయగా, మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతదేహం ఏపీలో పడేయడంతో ఇక్కడి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments