Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుట్టపైకి తీసుకెళ్లి గుట్టుచప్పుడుకాకుండా చంపేశాడు..

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (13:37 IST)
ప్రేమించిన అమ్మాయిని వదిలించుకునేందుకు ఓ ప్రేమికుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ఏకాంతంగా గడుపుదామని నమ్మించి తన ప్రియురాలిని జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి గుట్టుచప్పుడుకాకుండా చంపేశాడు. ఈ దారుణం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ మండలంలోని కుప్పినకుంట్ల గ్రామానికి చెందిన కావిటి తేజస్విని (20), సత్తుపల్లికి చెందిన నితిన్‌లు గంగారంలోని సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్‌ కళాశాలో పాలిటెక్నిక్‌ చదువుతూ వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. పాలిటెక్నిక్‌ తర్వాత నితిన్‌ ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చేరగా, తేజస్విని కొన్ని సబ్టెక్టు తప్పడంతో ఇంట్లోనే ఉంటూ వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో ప్రియుడుని ఒంటరిగా విడిచివుండలేని తేజస్విని.. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా నితిన్‌ను ఒత్తిడిచేయసాగింది. దీంతో ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. ఇందులోభాగంగా ఆదివారం సాయంత్రం తేజస్వినిని నితిన్‌ తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి సమీపంలోని గుట్టపైకి తీసుకువెళ్లాడు. 
 
అక్కడ ఆమెను చంపిపడేశాడు. కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు తేజస్విని కాల్‌డేటాలో నితిన్‌ నంబర్‌ గుర్తించారు. అతను ఖమ్మం వసతి గృహంలో ఉంటున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపేసినట్లు అంగీకరించాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి ఘటనా స్థలి నుంచి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments