Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితను శశికళే విషమిచ్చి చంపేశారు : కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం వెనుక కుట్ర దాగుందని తమిళనాడు తెలుగుయువశక్తి నేత కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు. అమ్మకు ఆమె స్నేహితురాలు శశికళ స్లో పాయిజన్‌ ఇచ్చి హతమార్చారని ఆరోపించారు.

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2016 (12:21 IST)
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం వెనుక కుట్ర దాగుందని తమిళనాడు తెలుగుయువశక్తి నేత కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు. అమ్మకు ఆమె స్నేహితురాలు శశికళ స్లో పాయిజన్‌ ఇచ్చి హతమార్చారని ఆరోపించారు. జయలలిత మృతిపై వెంటనే సిబిఐ విచారణ జరిపించి నిజానిజాలను నిగ్గుతేల్చాలని డిమాండ్‌ చేశారు. గతంలో కూడా అన్నంలో విషం పెట్టి జయలలితను చంపేందుకు శశికళ, ఆమె భర్త నటరాజన్‌ ప్రయత్నించారని, విషయం కనిపెట్టిన జయలలిత వారిని ఇంటి నుంచి, పార్టీ నుంచే బయటకు పంపేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం కూడా శశికళ అదేవిధంగా చేశారని, ఆమే జయలలితను చంపేశారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. జయలలిత మరణించిన తర్వాత వెంట వెంటనే అంత్యక్రియలు చేయడంపై అనుమానం వ్యక్తంచేశారు. శశికళ ప్లాన్‌లో భాగమే ఇదంతా జరిగిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.
 
ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించానని, సుప్రీంకోర్టు తన పిటిషన్‌ను కూడా స్వీకరించిందని, వెంటనే జయలలిత మృతి వెనుక ఉన్న నిజానిజాలను బయటపెట్టాలని బయటకు తీయాలన్నారు. అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయాలని కోరారు. ప్రముఖ సినీనటి గౌతమి ఇదే విషయంపై స్పందిస్తే అనవసర రాద్ధాంతం చేశారని చెప్పారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద స్వామివారిని ప్రార్థిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి శ్రీవారి హుండీలో వేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments