Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్త వేశారో తాటతీస్తాం.. రూ.10వేలు జరిమానా కట్టాల్సిందే..

హైదరాబాద్ మహా నగర కార్పోరేషన్ చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. జీహెచ్ఎంసీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి చెత్త సమస్య. బహిరంగంగా చెత్త వేయటాన్ని నిషేధించాలని ఇప్పటివరకు గ్రే

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2016 (12:20 IST)
హైదరాబాద్ మహా నగర కార్పోరేషన్ చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. జీహెచ్ఎంసీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి చెత్త సమస్య. బహిరంగంగా చెత్త వేయటాన్ని నిషేధించాలని ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన సందర్భంలో ఒక సరికొత్త వ్యూహాన్ని అమలు చేసి బహిరంగ చెత్తను నిర్మూలించాలని గ్రేటర్ కార్పోరేషన్ సంకల్పించింది. దీనిలో భాగంగానే ఒక పై గ్రేటర్ పరిధిలో ఎవరైనా బహిరంగంగా చెత్త వేస్తే వారికి పది వేల రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించింది.
 
చెత్తాచెదారం విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తే ప్రజారోగ్యానికి ఎటువంటి హానీ ఉండదని జీహెచ్ఎంసీ తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు, కూరగాయల మార్కెట్లు, వధశాలలు నిబంధనల మేరకు చెత్తాచెదారాన్ని తొలగించుకోవాలని పేర్కొంది. తడి, పొడి చెత్తను ఎప్పటికప్పుడు వేరుచేసి తరలించాలని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పడేస్తే రూ.10వేలు జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments