మంచి వాడిని దొంగ అన్నారు.. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బస్సులు నడపను : కేశినేని నాని

మంచివాడిని దొంగ అన్నారని, ఇది సమాజానికి మంచిది కాదని, తప్పు చేయడం తన డీఎన్ఏలో లేదని టీడీపీ ఎంపీ, కేశినేని ట్రావెల్స్ అధినేత నాని అన్నారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సులు నడపబోనని ఆయన తేల్చిచె

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (10:19 IST)
మంచివాడిని దొంగ అన్నారని, ఇది సమాజానికి మంచిది కాదని, తప్పు చేయడం తన డీఎన్ఏలో లేదని టీడీపీ ఎంపీ, కేశినేని ట్రావెల్స్ అధినేత నాని అన్నారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సులు నడపబోనని ఆయన తేల్చిచెప్పారు. ఈ రెండు రాష్ట్రాలు కాకుంటే మరో 27 రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయన్నారు. 
 
ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కొన్ని కారణాల వల్ల బస్సుల వ్యాపారం ఆపేయాలని అనుకున్నాను.. ఆపేశాను. నేను పుట్టింది.. పెరిగింది బస్సుల్లో. కావాలంటే, ఆ బస్సులను రోజూ శుభ్రంగా కడిగించుకుంటా.. వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తా తప్పా, ఈ రెండు రాష్ట్రాల్లో నా బస్సే తిప్పను. నా బస్సు.. సేఫెస్టు బస్సు ట్రావెల్ ఇన్ ది కంట్రీ. దేశవ్యాప్తంగా యాక్సిడెంట్ల లెక్కలు చూస్తే.. మా బస్సులకు యాక్సిడెంట్స్ పెద్దగా జరగలేదనే చెప్పవచ్చు. నేను తప్పు చేసినట్టయితే ఈ పాటికి నా వద్ద లక్ష బస్సులు ఉండేవన్నారు.
 
 రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొవ్వొత్తిలా కరుగుతూ వచ్చానే తప్పా.. పెరగలేదు. రెండేళ్ల నుంచి నా ట్రావెల్స్‌కు నష్టాలు వస్తున్న మాట వాస్తవమే. మార్కెట్లో కొన్ని అనుమతిలేని బస్సులు తిరుగుతుండటం వల్లే ఈ నష్టాలు వస్తున్నాయి. ఇటువంటి నష్టాలను తట్టుకుని ఇంకా పదేళ్లు నిలబడగల కెపాసిటి కేశినేని నానికి, ట్రావెల్స్‌కూ ఉంది... ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను బస్సుల వ్యాపారం చేయను’ అని నాని తెగేసి చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments