Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురందేశ్వరి, కన్నా ఇద్దరూ రాష్ట్రానికి ద్రోహులుగా మారిపోయారు.. కేశినేని నాని

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాష్ట్ర ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు. కన్నాకు టీడీపీ ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఎటాక్

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (09:58 IST)
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాష్ట్ర ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు. కన్నాకు టీడీపీ ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాష్ట్ర ద్రోహి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు.


నగరంలోని తన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడుతూ.. కన్నా రాష్ట్ర ద్రోహి అని, బీజేపీలో చేరి రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి అని విమర్శించారు.
 
అంతేగాకుండా పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరూ రాష్ట్రానికి ద్రోహులుగా తయారయ్యారని మండిపడ్డారు. బీజేపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అమరావతి బాండ్స్ గంటలో వేగంగా అమ్ముడు అయ్యాడంటే చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ వల్లే అది సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధితో ముందుకు వెళుతుందని కేశినేని నాని వ్యాఖ్యానించారు. 
 
దేశం స్వాతంత్ర్యం సాధించిన ఈ 72 సంవత్సరాలలో ఎన్నో కష్టనష్టాలు అధిగమించి ముందుకి వెళ్తుందని నాని అన్నారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్ల‌డం సంతోష‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments