Webdunia - Bharat's app for daily news and videos

Install App

యలమందలో కత్తి మహేష్ అంత్యక్రియలు, సినీప్రముఖులు ఎందుకు రాలేదు?

Webdunia
సోమవారం, 12 జులై 2021 (22:28 IST)
సినీ క్రిటిక్, సినీ నటుడు కత్తి మహేష్ అంత్యక్రియలు చిత్తూరు జిల్లాలో జరిగాయి. రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మృతి చెందిన కత్తి మహేష్ పార్థీవదేహాన్ని నిన్న సాయంత్రం స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని యలమందకు తీసుకొచ్చారు. 
 
యలమందలో కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. కత్తి మహేష్ మొదటి సంతానం కావడంతో దహనక్రియలను నిర్వహించారు. సినీప్రముఖులెవరూ పార్థీవ దేహాన్ని సందర్సించలేదు. కత్తి మహేష్ భార్య, కొడుకు, అతని తండ్రి, బంధువులు, యలమంద గ్రామస్తుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. 
 
కత్తి మహేష్ పార్థీవ దేహాన్ని సందర్సించేందుకు ప్రముఖులు వస్తారని అందరూ భావించారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సందర్సకుల అనుమతి కోసం పార్థీవదేహాన్ని ఉంచారు. అయితే ఎవరూ రాకపోవడంతో అంత్యక్రియలను పూర్తి చేశారు. 
 
సినీనటుడిగాను, సినీ విశ్లేషకుడి గాను కత్తి మహేష్ మంచి పేరు సంపాదించారు. సినీపరిశ్రమలో చాలామంది ప్రముఖులతో పరిచయాలు కూడా కత్తి మహేష్‌కు ఉన్నాయి. అయితే ప్రముఖలెవరూ హాజరు కాలేకపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments