Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామకృష్ణంరాజు ఓ తేడా మనిషి : వైకాపా ఎమ్మెల్యే కారుమూరి

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (15:08 IST)
సొంత పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైకాపాకు చెందిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రఘురామకృష్ణంరాజు ఓ తేడా మనిషి అంటూ మండిపడ్డారు. పైగా, ఆయన్ను అసలు తాను మనిషిగా కూడా చూడనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానంపై రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తనకు ఎంతో అభిమానం ఉందని చెపుతూనే... పార్టీపై, పార్టీ నేతలపై ఆయన చేస్తున్న విమర్శలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. 
 
ముఖ్యంగా పార్టీలో నెంబర్ 2గా చెప్పుకునే విజయసాయిరెడ్డిని ఆయన టార్గెట్ చేస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల జగన్‌కు ఆయన రాసిన లేఖలో కూడా... ఓవైపు స్వామి భక్తిని ప్రదర్శిస్తూనే... మరోవైపు తాను చేయాల్సిన విమర్శలన్నీ చేశారు. అలాగే, తణుకు వైకాపా ఎమ్మెల్యేపై కూడా తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో తణుకు ఎమ్మెల్యే నాగేశ్వర రావు తాజాగా మీడియా ముందుకు వచ్చారు. రఘురామకృష్ణంరాజు ఒక తేడా మనిషి అంటూ మండిపడ్డారు. ఆయనను తాను ఒక మనిషిగా కూడా గుర్తించడం లేదని చెప్పారు. ఆయన బీజేపీలోకి వెళ్లిపోతున్నారని... అందుకే ప్రధాని నరేంద్ర మోడీ భజన చేస్తున్నారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments