Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామకృష్ణంరాజు ఓ తేడా మనిషి : వైకాపా ఎమ్మెల్యే కారుమూరి

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (15:08 IST)
సొంత పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైకాపాకు చెందిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రఘురామకృష్ణంరాజు ఓ తేడా మనిషి అంటూ మండిపడ్డారు. పైగా, ఆయన్ను అసలు తాను మనిషిగా కూడా చూడనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానంపై రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తనకు ఎంతో అభిమానం ఉందని చెపుతూనే... పార్టీపై, పార్టీ నేతలపై ఆయన చేస్తున్న విమర్శలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. 
 
ముఖ్యంగా పార్టీలో నెంబర్ 2గా చెప్పుకునే విజయసాయిరెడ్డిని ఆయన టార్గెట్ చేస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల జగన్‌కు ఆయన రాసిన లేఖలో కూడా... ఓవైపు స్వామి భక్తిని ప్రదర్శిస్తూనే... మరోవైపు తాను చేయాల్సిన విమర్శలన్నీ చేశారు. అలాగే, తణుకు వైకాపా ఎమ్మెల్యేపై కూడా తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో తణుకు ఎమ్మెల్యే నాగేశ్వర రావు తాజాగా మీడియా ముందుకు వచ్చారు. రఘురామకృష్ణంరాజు ఒక తేడా మనిషి అంటూ మండిపడ్డారు. ఆయనను తాను ఒక మనిషిగా కూడా గుర్తించడం లేదని చెప్పారు. ఆయన బీజేపీలోకి వెళ్లిపోతున్నారని... అందుకే ప్రధాని నరేంద్ర మోడీ భజన చేస్తున్నారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments