Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావుగా ఉందని పెళ్లికి ముందుకురాని యువకులు.. ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (14:33 IST)
ఓ యువతి తనకు పెళ్ళి సంబంధాలు కుదరడం లేదన్న బాధతో తన ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా స్తంభంపల్లిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బోయినపల్లి మండలంలోని స్తంభంపల్లి గ్రామానికి చెందిన తంగళ్ళపల్లి అనిత (27) అనే యువతి డిగ్రీ పూర్తి చేసింది. దీంతో ఆమెకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, ఎన్నో సంబంధాలు చూసినా అవి కుదరలేదు. 
 
ముఖ్యంగా, అనిత కొద్దిగా లావుగా ఉండటంతో ఆమెను చేసుకునేందుకు యువకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి... పురుగుల మందు సేవించింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నమోదు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments