Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపు ఉద్యమం కొత్త పంథా తొక్కనుందా...?

కాపు ఉద్యమాన్ని తన భుజాలపై మోస్తున్న ఏకైక వ్యక్తి ముద్రగడ పద్మనాభం. చంద్రబాబు ప్రభుత్వం కాపులకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఎన్నోసార్లు ఆక్షేపించారు ముద్రగడ. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని చేసి, ఎన్నోరోజులు గృహనిర్బంధంలో ఉన్న

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (19:53 IST)
కాపు ఉద్యమాన్ని తన భుజాలపై మోస్తున్న ఏకైక వ్యక్తి ముద్రగడ పద్మనాభం. చంద్రబాబు ప్రభుత్వం కాపులకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఎన్నోసార్లు ఆక్షేపించారు ముద్రగడ. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని చేసి, ఎన్నోరోజులు గృహనిర్బంధంలో ఉన్నారు కూడా. చంద్రబాబు నాయుడు కాపు ఉద్యమాన్ని తన అధికారంతో అణగదొక్కగలిగాడు కానీ, కాపుల్లో అసంతృప్తిని, టిడిపిపై ద్వేషాన్ని తగ్గించలేకపోయాడని వాపోతున్నారు ముద్రగడ అభిమానులు.
 
భవిష్యత్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాపు ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలనే దానిమీద ముద్రగడ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఐక్యకార్యాచరణ కమిటీ కీలక సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కాపుల వ్యూహం ఏమిటి? గతంలో మోసం చేసిన పార్టీని గద్దె దింపేందుకు ఏం చేయాలి?
 
కుల పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి? ఇలాంటివాటిపై జెఏసీ నిర్ణయం ప్రకారం ప్రణాళిక ఉంటుందని ముద్రగడ పద్మనాభం ప్రకటించడం సంచలనాన్ని రేపింది. చంద్రబాబునాయుడు కాపు జాతికి చేసిన అన్యాయం దేశంలో ఎవ్వరికీ జరిగి ఉండదని ఈ సందర్భంగా ఉద్యమనేత ముద్రగడ ఆవేదనతో అన్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments