Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపులు ఏ పార్టీకి కాపు కాయాలి? పవన్ లేదా కాంగ్రెస్?

కాపులు ఏ పార్టీకి మద్దుతు పలకాలి అనే అంశం పై కాపు జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి ) ఓ నిర్ణయం తీసుకోనుంది. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ తీరును చూస్తే కాపులు కాంగ్రెస్ పార్టీకి లేదా జనసేనలకు మద్దుతు పలికే అవకాశం ఉందా అన్న అభిప్రాయం కలుగుతోంది. అయిత

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (12:21 IST)
కాపులు ఏ పార్టీకి మద్దుతు పలకాలి అనే అంశం పై కాపు జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి ) ఓ నిర్ణయం తీసుకోనుంది. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ తీరును చూస్తే కాపులు కాంగ్రెస్ పార్టీకి లేదా జనసేనలకు మద్దుతు పలికే అవకాశం ఉందా అన్న అభిప్రాయం కలుగుతోంది. అయితే  పదమూడు జిల్లాల కాపు జెఎసిలు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడుతానని ముద్రగడ చెపుతున్నారు. 
 
తిరుపతి మాజీ ఎంపీ కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్‌ను ముద్రగడ కలిసిన సందర్భంతో ఈ విషయం చర్చకు వచ్చినట్టు సమాచారం. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కాపు పెద్దలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కాపుల రిజర్వేషన్ పైన హామీ ఇచ్చినా, కేంద్రం పరిధిలో ఉందని చేతులు ఎత్తేసిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా కేంద్రం చేతిలో ఉందని చెబుతుండటాన్ని కాపు నేతలు చర్చించినట్టు సమాచారం.
 
కాంగ్రెస్‌ పార్టీ కాపు రిజర్వేషన్ల అంశానికి మద్దతు తెలుపుతానంటున్ననేపథ్యం, 9వ షెడ్యూలులో కాపు రిజర్వేషన్ల బిల్లు పెట్టేలా కృషి చేసి బీసీలకు ఇబ్బంది కలగకుండా కాపులకు న్యాయం చేసేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హామీ ఇవ్వడం... ఈ నేపథ్యంలో జెఎసి నేతలు అభిప్రాయాలు చెబితే ఆ ప్రకారం వచ్చే ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో నిర్ణయించవచ్చని ముద్రగడ అన్నట్టు కాపు నేతలు తెలియజేస్తున్నారు. మరి కాపులు ఏ పార్టీకి కాపు కాస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments