విద్యార్థినిపై అత్యాచార యత్నం... సన్నివేశాలు సోషల్ మీడియాలో పోస్ట్(వీడియో)

కామాంధుల దుశ్చర్యలు రోజురోజుకీ పెచ్చుమీరిపోతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారయత్నం చేసి ఆ సన్నివేశాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అంతటితో ఆగకుండా ఆ ద

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (20:33 IST)
కామాంధుల దుశ్చర్యలు రోజురోజుకీ పెచ్చుమీరిపోతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారయత్నం చేసి ఆ సన్నివేశాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ పోస్టుతో యువతిపై వారు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... కనిగిరిలోని ఓ ప్రైవేటు కాలేజీలో సదరు యువతి చదువుతోంది. 
 
ఈ క్రమంలో కార్తీక్ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. దానికి ఆమె తిరస్కరించింది. దీనిపై ఆగ్రహం చెందిన కార్తీక్ తన స్నేహితులు అనీల్, సాయిలను తీసుకుని యువతిని మంచిగా మాట్లాడుతూనే ఈ విషయంపై మాట్లాడదాం అంటూ కనిగిరి శివారు ప్రాంతంలోకి ఆమెను తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ కార్తీక్ తనను ప్రేమించాలని ఒత్తిడి చేయడంతో ఆమె నిరాకరించింది. అంతే... ముగ్గురూ కలిసి ఆమెపై అత్యాచార యత్నం చేశారు. 
 
ముగ్గురినీ ఎంత బ్రతిమాలాడినా రాక్షసుల్లా ఆమెపై అఘాయిత్యం చేయబోయారు. పైగా ఆ సన్నివేశాలను వీడియో తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయాన్ని తల్లిదండ్రుల వద్ద చెప్పేందుకు యువతి భయపడింది. కానీ సోషల్ మీడియాలో పోస్టులు చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. టవీ9 వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments